Wednesday, September 16, 2026
Homeమెదక్ప్రమాద బాధితులను రక్షించిన వారికి కేంద్రం నుంచి రూ.25 వేల ప్రోత్సాహకం

ప్రమాద బాధితులను రక్షించిన వారికి కేంద్రం నుంచి రూ.25 వేల ప్రోత్సాహకం

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ చికిత్స

‘పీఎం రాహ్-వీర్’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, జులై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (16) రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం రాహ్-వీర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. రోడ్డు ప్రమాదం జరిగిన తొలి **’గోల్డెన్ అవర్’**లో గాయపడిన వ్యక్తిని సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రికి సురక్షితంగా తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తుందని ఎస్పీ తెలిపారు. అలాగే, ప్రమాద బాధితులకు పీఎం రాహ్-వీర్ పథకం కింద రూ.1.5 లక్షల వరకు లేదా గరిష్టంగా ఏడు రోజుల పాటు ఉచిత క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రజలు ఆలస్యం చేయకుండా 112, 100 లేదా 108 అత్యవసర సేవలకు సమాచారం అందించి, బాధితులను సురక్షితంగా సమీప ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలని ఎస్పీ సూచించారు. సమయానికి చికిత్స అందించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అత్యవసర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రమాద బాధితులకు సహాయం చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!