Friday, July 31, 2026
Homeమెదక్జూలై 31లోపు రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలి: జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్

జూలై 31లోపు రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలి: జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్

📰 Generate e-Paper Clip

A2న్యూస్, జులై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్(17) జిల్లాలోని అర్హులైన రేషన్ కార్డుదారులందరూ ఈ నెల జూలై 31, 2026 లోపు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పౌర సరఫరాల కమిషనర్ ( సి సి ఎస్) ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వానికి(జి ఓ ఎల్ ) ఈ-కేవైసీ వివరాలను నవీకరించాల్సి ఉన్నందున జిల్లాలో ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల డీలర్లు తమ పరిధిలోని లబ్ధిదారులతో పాటు ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్'( ఓ ఎన్ ఓ ఆర్ సి) పోర్టబిలిటీ ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలను ప్రతిరోజూ నిరంతరాయంగా తెరిచి ఉంచి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఈ-కేవైసీ నిర్వహించి జూలై 31లోపు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించినట్లు తెలిపారు. త్వరలో కమిషనర్ జిల్లాల వారీగా ఈ-కేవైసీ పురోగతిని సమీక్షించనున్నందున, అర్హులైన రేషన్ కార్డుదారులందరూ తమ సమీప రేషన్ దుకాణాన్ని సందర్శించి నిర్ణీత గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!