A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) జూలై 30:
నర్సాపూర్ (29) జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని ఎస్జీ టీయూ ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం నర్సాపూర్ పాఠశాలలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్జీ టీయూ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి విద్యను బలోపేతం చేయాలని, జీవో నెంబర్ 25 వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి టి యు మండల అధ్యక్షులు గణేష్, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు కళా రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, మహిళాఉపాధ్యాయురాలు రామేశ్వరి, అరుణ, అనిత, సునీత, హైమావతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

