Saturday, September 12, 2026
Homeమెదక్భూ రికార్డుల పైన విచారణ జరిపించాలి: ఎంపీ రఘునందన్ రావు

భూ రికార్డుల పైన విచారణ జరిపించాలి: ఎంపీ రఘునందన్ రావు

📰 Generate e-Paper Clip

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 3:

నర్సాపూర్ (2) ధరణి, భూభారతి రికార్డుల పైన విచారణ జరిపించాలని అలాగే స్వతంత్ర సంస్థతో 22/A భూములపై విచారణ జరిపించి రైతులకు భూ యజమానులకు న్యాయం జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ లుముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22/A భూముల విషయంలో ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు భూముల అంశంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.22/A నిషేధిత జాబితాలో ఉన్న భూముల పూర్తి జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!