Friday, July 31, 2026
Homeమెదక్ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

📰 Generate e-Paper Clip

A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా జూన్ 23 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 95,313 మంది రైతుల నుంచి మొత్తం 4,21,083.240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే 90,221 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 928.85 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 531 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన కొనుగోలు ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!