ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాఖమూరి యాదగిరి
A2న్యూస్, జులై 28, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్)
నర్సాపూర్ (27) ఎస్సీ ఉపకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాఖమూరి యాదగిరి హోలీయ దాసరి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 57 ఎస్సీ ఉప కులాల మహా ధర్నా రాష్ట్ర ఇంచార్జి బైరి వెంకటేశం,57 ఎస్సీ కులాల జెఎసిఆధ్వర్యంలో ఆగస్టు 08, శనివారం ఇందిరా పార్క్, హైదరాబాద్ వద్ద జరిగే ఎస్సీ ఉప కులాల ఆత్మగౌరవ మహా ధర్నాకు ఎస్సీ ఉపకులాలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

