దండుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 18:
మనోహరాబాద్ (17) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ మరాఠీ నాగరాజు చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బండారి నాగమణి వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి హేమలత, వార్డు సభ్యులు కోనేరు సురేష్ కుమార్, దీపిక, ఎల్లేష్, స్వాతి, రాజు, నరేష్, ఉదయ్ గౌడ్, మనీషా, కొయిరాల సురేష్ కుమార్, స్వరూప యాదగిరి పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు బిక్షపతి, మరాఠీ నరేందర్తో పాటు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

