ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్ర మాదిగ
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 28:
నర్సాపూర్ (27) అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాటం చేద్దామని ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్ర మాదిగ అన్నారు. గురువారం పెద్దలోడి గ్రామంలోని మాదిగ యువతతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఆర్.పి.ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మైసగల్ల బుచేంద్రమాదిగమాట్లాడుతూబడుగుబలహీనవర్గాలకోసం,అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలనిపిలుపునివ్వడం జరిగింది. మండల కమిటీ నిర్మాణంలో, భవిష్యత్తులో మందకృష్ణ మాదిగచేసేపోరాటంలోభాగస్వాములు కావాలని తెలిపారు. గ్రామ, మండల కమిటీలు త్వరగా పూర్తిచేసుకునిచలోవరంగల్ కు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగేసెప్టెంబర్9నచలోవరంగల్ఎమ్మార్పీఎస్. జాతీయమహాసభను విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలోనాయకులు జంగం నవీన్, పూర్ర సంతోష్, జిల్లా ఇన్చార్జి వి.ఎస్.రాజు మాదిగ, రామారపు శ్రీనివాస్, గంధగల వీరయ్య మాదిగ,పూర్ర సంతోష్ మాదిగ, అందోల్ నియోజకవర్గ ఇన్చార్జ్ , జంగం నవీన్ మాదిగ, మునిపల్లి మండల కోఆర్డినేటర్, జెట్టిసుధాకర్ మాదిగ, గ్రామ యువత పాల్గొన్నారు.

