A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (27)మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో ఎస్ఐఆర్ (SIR) సర్వే కార్యక్రమానికి సంబంధించిన ఎస్ఐఆర్ స్లిప్స్ను గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి కుటుంబం ఎస్ఐఆర్ సర్వేలో పాల్గొని సరైన వివరాలను అందించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడానికి ప్రజలు సర్వేకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

