ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలి: మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 1: మెదక్ జిల్లా (31) ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి...