పులిమామిడి–నార్లపూర్ రహదారికి మరమ్మతులు చేపట్టాలి
గుంతలమయమైన రహదారితో ప్రజలకు అవస్థలు.. త్వరలో పనులు ప్రారంభిస్తామన్న ఏఈ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి రాము ఆగస్టు 13: చేగుంట (12) చేగుంట మండలం పులిమామిడి–నార్లపూర్ మధ్య అధ్వానంగా మారిన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పులిమామిడి గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత ఏఈ, డీఈఓ, ఈఈ అధికారులను కలిసి రహదారి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో...