A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 6:38 am Posted by : A2TV NEWS

విద్యార్థి పోరు దీక్షను విజయవంతం చేయండి

జనసేన పార్టీ నర్సాపూర్ నాయకులు శాఖమూరి యాదగిరి 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 6:

నర్సాపూర్ (5) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున చేస్తున్న విద్యార్థి పోరు దీక్షను విద్యార్థులు యువత పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు శాఖమూరి యాదగిరి ఒక ప్రకటనలో కోరారు. గురువారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగే ధర్నా కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.