A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 6:27 am Posted by : A2TV NEWS

మజీద్‌పల్లికి మహర్దశ.. రోడ్డు పనులకు భూమిపూజ

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 3:

మనోహరాబాద్ (2) మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి మొండికుంట నుంచి శివారు గ్రామమైన మజీద్‌పల్లికి చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ కందాల రాజనర్సింహ ఆధ్వర్యంలో గురువారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే మజీద్‌పల్లి గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని సర్పంచ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామ్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ, సలీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెంటయ్య, సంజీవ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.