A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్టు 7:
నర్సాపూర్ (6) ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నర్సాపూర్ ఇంచార్జ్ మంకిడిరాములుముదిరాజ్ అన్నారు. డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లిజయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సాపూర్ ఇంచార్జ్ మంకిడి రాములు మాట్లాడుతూ తెలంగాణ కోసం తపించిన జయశంకర్ సార్ సేవలు ఎప్పటికీచిరస్మరణీయమని అన్నారు. ఈకార్యక్రమంలో నర్సాపూర్ అధ్యక్షులు ఆనంద్ కురుమ, హత్నూర మండల అధ్యక్షుడు నరేష్, సురేష్, వజ్జ రాములు, మోడే జనార్ధన్, గొల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.