నేడు సంగారెడ్డిలో జనసేన పార్టీ సమావేశం

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 6: నర్సాపూర్ (5) ఈ నెల 6న ఆదివారం జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని నర్సాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి హోలియా దాసరి తెలిపారు. మెదక్ పార్లమెంట్ జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం సంగారెడ్డి లోని పీఎస్ఆర్ గార్డెన్ లో ఉంటుందని నర్సాపూర్ నియోజకవర్గంలో నుండి జనసైనికులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సమావేశం విజయవంతం చేయగలరని కోరారు.