A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 6:50 am Posted by : A2TV NEWS

ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప విజయాలు సాధ్యం

కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం ప్రతి ఒక్కరి బాధ్యత

చేగుంటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు కృషి చేస్తా: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

A2న్యూస్, జూలై 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట(18) ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే దేశంలోనే అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చని రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం Sureify School Kits ఆధ్వర్యంలో నిర్వహింప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడితే దేశంలోనే అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చని రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.చిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు బ్లాక్‌బోర్డు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివి ఐఐటీలు, ఐఐఐటీలు, మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధిస్తున్నారని చెప్పారు. చేగుంట ప్రభుత్వ పాఠశాల నుంచే ఇద్దరు విద్యార్థులు ఐఐఐటీలో ప్రవేశం పొందడం ఉపాధ్యాయుల నిబద్ధతకు నిదర్శనమని అభినందించారు. ప్రతి విద్యార్థి జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండాలని, డాక్టర్, ఐఏఎస్, ఇంజనీర్ వంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. విజయానికి క్రమశిక్షణే ప్రధాన ఆధారమని, చదువుతో పాటు కష్టపడి పనిచేసే అలవాటు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మెరుగైన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయడం అభినందనీయమన్నారు. విద్యాభివృద్ధికి సేవలందిస్తున్న సంకల్ప్ సంస్థ చేస్తున్న సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. తన తండ్రి వెంకటస్వామి స్ఫూర్తితో సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావన అలవడిందని మంత్రి తెలిపారు. వ్యాపారంలో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని చెప్పారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించడం దాతృత్వం కాదని, అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా నేటి కాలంలో అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ (AI) విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక నైపుణ్యాలు అవసరమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ అందిస్తోందన్నారు. అలాగే TOMCOM ద్వారా విదేశీ భాషల శిక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి విలువలతో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. చేగుంట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కళాశాల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్, Sureify మేనేజింగ్ డైరెక్టర్, సంకల్ప్ సంస్థ ప్రతినిధులు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, చేగుంట సర్పంచ్, ఉపసర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.