A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 4:
మనోహరాబాద్ (3) మనోహరాబాద్ మండలంలోని, గ్రామాల్లో గురువారం, వి బి జి ఆర్ ఏ ఎం క్రింద వికసిత్ గ్రామ పంచాయతి ప్రణాళిక పై పలు గ్రామాల్లో గ్రామసభలునిర్వహించారు. ఈ మేరకు, రంగాయపల్లి, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీడీవో కృష్ణమూర్తి, కాలకల్ చెట్ల గౌరారం గ్రామాల్లో ఎంపీ ఓ ఆదినారాయణ. లింగారెడ్డి పేట గ్రామంలో జ్యోతి టి ఏ, కొండాపూర్ గ్రామంలో జగపతి టిఏ గారు, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం గ్రామసభలునిర్వహించడం జరిగిందని ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు.