వనదుర్గ భవాని ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 14: మెదక్ జిల్లా (13) మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్లో గురువారం వనదుర్గ భవాని ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నాచారం చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా రాజ్కుమార్, ఉపాధ్యక్షులుగా అబ్రహం, తిగిట సాయిరాం, చింతల సిద్దు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్. రాము, సహాయ కార్యదర్శులుగా నరేష్ యాదవ్, సైఫదిన్, కోశాధికారిగా మహేష్ బాధ్యతలు...